ఈ వారం చదివిన ఒక మచి కథల సంకలనం "తాత్విక కథలు"
మధురాంత్రకం నరేంద్ర సంకలనం చేసిన ఈ పుస్తకంలో 29 కథలున్నాయి.
చలం, విశ్వనాథ, శ్రీశ్రీ, గోపీచంద్, ఆలూరి బైరాగి, పాలగుమ్మి పద్మరాజు, రాచకొండ విశ్వనాథశాస్త్రి, కాళీపట్నం రామారావు, మధురాంతకం రాజారాం, హితశ్రీ, వాకాటి పాండురంగరావు, ముళ్ళపూడి వెంకటరమణ, ఆర్. ఎస్. సుదర్శనం, సత్యం శంకరమచి, అల్లం శేషగిరి రావు, ఆర్. వసుంధరా దేవి, త్రిపుర, ఏ వి రెడ్డిశాస్త్రి, శ్రీసుభా, పాపినేని శివశంకర్, జలంధర, స్వామి, మహేంద్ర, కె.ఎస్.రమణ, రమణజీవి, డా.వి.ఆర్.రాసాని, ఎమ్మెస్. సూర్యనారాయణ, టి.శ్రీవల్లీరాధిక, మధురాంత్రకం నరేంద్ర - ఇందులోని కథకులు.
నాలుగోవంతుకి పైగా కథలు అద్భుతంగా అనిపించాయి.
రెండు వంతులకి పైగా కథలు విపరీతంగా ఆలోచింపచేసాయి
ఒక వంతుకన్నా తక్కువ కథలు కాస్త సాధారణంగా అనిపించాయి కానీ, వాటిల్లో కూడా నాకు తెలియని లోతులున్నాయేమో.. మరోసారి చదివినపుడు మరోరకమైన భావన కలుగుతుందేమో చెప్పలేను. ఎందుకంటే ఆర్. వసుంధరాదేవిగారి "పెంజీకటికవ్వల" ఇదివరకు చదివిన కథే. అపుడు అంత బాగుందనుకున్న గుర్తు లేదు. కానీ ఇప్పుడు చదివితే చాలా గొప్పగా అనిపించింది.
సృష్టిలో, జీవన్ముక్తుడు, కానుక, మధురమీనాక్షి, పెంజీకటికవ్వల నాకు బాగా నచ్చిన కథలు.ఈ సంకలనంలోని కథలని విశ్లేషించడం నా శక్తికి మిచిన పని. అందుకే నా అభిప్రాయాన్ని మాత్రం రాసుకుని వూరుకుంటున్నాను.
Showing posts with label సంకలనం. Show all posts
Showing posts with label సంకలనం. Show all posts
Monday, May 18, 2009
Subscribe to:
Posts (Atom)